ఎల్ఎండీకి భారీగా వరద నీరు

51பார்த்தது
ఎల్ఎండీకి భారీగా వరద నీరు
తిమ్మాపూర్ లో గల ఎల్ఎండీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మోయతుమ్మెద వాగు ద్వారా జలాశయంలోకి నీరు భారీగా వస్తోంది. దీంతో అధికారులు మధ్య మానేరు జలాశయం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. మధ్య మానేరు నుంచి ఎల్ఎండీకి సుమారు 8టీఎంసీల నీరు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి వాగు ద్వారా 7600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో జలాశయంలోకి వస్తుంది. ప్రస్తుతం సోమవారం వరకు 15. 584 టీఎంసీల నీరున్నట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி