మెట్ పల్లి బస్టాండ్ లో పోలీసుల తనిఖీలు

59பார்த்தது
మెట్ పల్లి బస్టాండ్ లో పోలీసుల తనిఖీలు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి బస్టాండులో ఆదివారం పోలీసులు బాంబ్ స్క్వాడ్ తోపాటు డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుండి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఈ నేపధ్యంలో బస్టాండులోని ప్రతీ బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వారి పూర్తి వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న వారు తీసుకొచ్చిన ప్రతీ బ్యాగును డాగ్ చేత పరిశీలించారు.

தொடர்புடைய செய்தி