మెట్ పల్లి పట్టణంలో శనివారం 500 మట్టి గణపతులను పర్యావరణాన్ని కాపాడాలని మురళి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యావరణ అనుకూల వినాయకులు అని పిలువబడే మట్టి గణపతులు సహజమైన మట్టితో తయారుచేసి అవి జీవ అధోకరణం చెందుతాయని, నీటిలో కరిగి కాలుష్యాన్ని తగ్గిస్తాయని, పర్యావరణ అనుకూలత, సాంప్రదాయ పద్ధతులు, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో సహాయపడుతుందని తెలిపినారు.