గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: ఎస్పీ

60பார்த்தது
గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: ఎస్పీ
గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ చర్యలను చేపట్టామని, అందరూ ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కోరారు. జగిత్యాల పట్టణంలో గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గాలు టవర్ సర్కిల్, లడ్డూ కాజా, తీన్ ఖని, నిమజ్జనం జరిగే చింతకుంట చెరువు ప్రాంతాలను ఎస్పీ మంగళవారం రాత్రి పరిశీలించారు. ఆయన వెంట డిఎస్పి రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్, వేణుగోపాల్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி