నిందితుడికి ఏడాది జైలు శిక్ష

79பார்த்தது
నిందితుడికి ఏడాది జైలు శిక్ష
రోడ్డు ప్రమాదం కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి సిద్దిపేట సెషన్స్ కోర్టు జైలుశిక్ష విధించింది. గజ్వేల్ సీఐ సైదా తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 14, 2020లో 104 అంబులెన్స్ గజ్వేల్ నుంచి దౌల్తాబాద్ వెళ్తూ జాలిగామ అంబేడ్కర్ విగ్రహం వద్ద గంగాల పోచయ్య, నవ్యను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గంగాల పోచయ్య చికిత్సపొందుతూ 2021 జనవరి 7న మృతి చెందాడు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఏడాది జైలుశిక్ష విధించారు.

தொடர்புடைய செய்தி