వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ

56பார்த்தது
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్బరుపేట భూంపల్లి ఎస్ఐ హరీష్ గౌడ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని మరో మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కూలిపోయే సిద్ధంగా ఉన్న ఇళ్లల్లో ఎవరు నివాసం ఉండరాదు అన్నారు. పరివాహ ప్రాంతాల్లో నీటిలోకి ఎవరు వెళ్లొద్దని తెలిపారు. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లో సహకారం అందించేందుకు పోలీస్ స్టేషన్ నెంబర్ 8712667328 అందుబాటులో ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ సూచించారు.

தொடர்புடைய செய்தி