విద్యార్థినులను వేధించిన నిందితులపై కాల్పులు(వీడియో)

52பார்த்தது
యూపీలోని డియోరియా జిల్లాలో కోచింగ్ కు వెళ్తున్న బాలికలను బలవంతంగా లాక్కెళ్లేందుకు ఇటీవల ఇద్దరు దుండగులు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఓ ఇన్‌ఫార్మర్‌ సమాచారంతో పోలీసులు దుండగులిద్దరిని గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులపై దుండగులు కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. తిరిగి పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయి. నిందితులు బైకుంత్‌పూర్ కు చెందిన ధీరజ్ పటేల్, హృతిక్ యాదవ్‌లుగా పోలీసులు గుర్తించారు.

தொடர்புடைய செய்தி