లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ADR కీలక రిపోర్ట్ బయటపెట్టింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దాదాపు 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులుగా ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం.. 359 మంది 5వ తరగతి వరకే చదువుకున్నట్లు తెలిపింది. 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చదువుకున్నారు.