సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి వైద్యులతో మాట్లాడి డెంగ్యూ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.