మండలంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

68பார்த்தது
జిన్నారం మండల కేంద్రంలో రాఖీ పౌర్ణమి వేడుకలను అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు ఘనంగా జరుపుకున్నారు. ఆత్మీయతకు అద్దం పట్టే రాఖి పండుగ సందర్భంగా అన్నలు తమ్ముళ్లకు అక్కలు చెల్లెళ్లు చేతులకు రక్షాబంధనాలను కట్టి స్వీట్లు తినిపించారు. మంగళ హారతులు పట్టి చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. చిన్నారులు చిట్టి చేతులకు రాఖీలు కట్టుకొని మురిసిపోయారు. రాఖీ వేడుకలతో ప్రతి ఇంట సంతోషకరమైన వాతావరణం నెలకొంది.

தொடர்புடைய செய்தி