ఇంటింటికి ఫీవర్ సర్వే: మున్సిపల్ చైర్‌పర్సన్

76பார்த்தது
ఇంటింటికి ఫీవర్ సర్వే: మున్సిపల్ చైర్‌పర్సన్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డ్ గాంధీనగర్ లో బొల్లారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శుక్రవారం ఏర్పాటు చేసిన *ఇంటింటికి ఫివర్ సర్వే* కార్యక్రమాన్ని బొల్లారం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి ప్రారంభించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మంగతయారు ఉన్నారు.

தொடர்புடைய செய்தி