డ్రగ్స్ తో జీవితాలను నాశనం చేసుకోవద్దు

84பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంజీర విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పటాన్చెరు డిఎస్పి రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు ఎవ్వరు కూడా డ్రగ్స్ కు అలవాటు పడకూడదని, అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி