రేవంత్ పదివేలు.. మోదీ ఏమంటారో..?

51பார்த்தது
రేవంత్ పదివేలు.. మోదీ ఏమంటారో..?
రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. కనీ వినీ ఎరగని తీరులో భారీ వర్షాలు కురియడంతో ప్రజా జీవితం అస్తవ్యస్తం అయింది. అంతే కాదు భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగింది.ఇంతటి పెను విపత్తు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలూ బాగా దెబ్బ తిన్నాయి.తెలంగాణాలో కేంద్ర బృందం పర్యటించి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయింది. ఈ సందర్భంగా కేంద్ర బృందానికి రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. అయితే రేవంత్ అడిగిన సాయంపై మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

தொடர்புடைய செய்தி