గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం వేడుకలు ప్రారంభమయ్యాయి. గురుపౌర్ణమి సందర్బంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం సాయిబాబా ఆలయంలో తెల్లవారు జాము నుండే భక్తులు బారులు తీరడం జరిగింది. అన్ని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పూజలు, భజనలు, కీర్తనలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శిరిడీ సహా ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది.