నేటి యువత రాష్ట్ర స్థాయిలో అంత రాష్ట్రా స్థాయిలో ప్రతిభ కనబరచాలని

505பார்த்தது
నేటి యువత రాష్ట్ర స్థాయిలో అంత రాష్ట్రా స్థాయిలో ప్రతిభ కనబరచాలని
బుధవారం నాడు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో జల్పల్లి మున్సిపాలిటీ లో ముస్తఫా లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని క్రికెట్ లీగ్ నిర్వాహ కమిటీ స్థానిక ప్రజా ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికి పూలమాలతో శాలువాతో సన్మానించారు. యువ నాయకులు, క్రీడాకారులను పరిచయం చేసుకొని అనంతరం టాస్ వేసి కొంతసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరచడం జరిగినది.ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ రిప్రెజెంటేటివ్ వైస్ చైర్మన్. యూసఫ్ పటేల్, జల్పల్లి మున్సిపల్ కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ జహంగీర్ ,కౌన్సిలర్ శంషుద్దీన్, షేక్ అఫ్జల్ సౌద్ అవాల్గి ,జల్పల్లి మున్సిపాలిటీ బీసీ సెల్ అధ్యక్షులు ఉస్కెమూరి, నిరంజన్ నేత యూత్ నాయకులు మున్సిపాలిటీ మైనార్టీ అధ్యక్షులు హుస్సేన్ బవాజీర్, తదితరులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி