బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

398பார்த்தது
బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
మంగళవారం ఉదయం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో జల్పల్లి పురపాలక సంఘం శ్రీరామ కాలనీకి చెందిన బిజెపి కాంగ్రెస్ నాయకులు మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న బిజెపి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. జల్పల్లి మున్సిపాలిటీ కాలనీలలో మరింత అభివృద్ధి జరగాలంటే కేవలం సబితా ఇంద్రారెడ్డితోనే సాధ్యమని గ్రహించి ఈరోజు యువ నాయకులు డైనమిక్ లీడర్ యంజాల అర్జున్ ఆధ్వర్యంలో 40 మంది యువకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరటం జరిగినది.

మంత్రి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఒక మహిళ మంత్రిగా నియోజకవర్గాన్ని తన ఇంటిగా భావించి అనునిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల కోసం పాటుపడే మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సేవలు మరువలేక పార్టీలోకి రావడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మాజీ సర్పంచ్ మాజీ రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు ప్రస్తుత జల్పల్లి, మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, జల్పల్లి మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు దూడల శ్రీనివాస్ గౌడ్, జల్పల్లి మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చందనం రాజేష్, కౌన్సిలర్స్ కే. లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி