యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

160பார்த்தது
యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లో యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ నియమకాలలో పెట్టిన అవకతవకలను వెంటనే తొలగించి అర్హులు అయిన అందరికి పోలీస్ ఉద్యోగం కలిపించాలి అని, డిమాండ్ చేస్తూ మహేశ్వరం నియోజక వర్గం యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, మీర్పేట్ కార్పొరేషన్ టీ. కే. అర్ చౌరస్తాలో సంతకాల సేకరణ చేయడం జరిగింది.అర్హులైన అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని మహేశ్వరం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ప్రనీష్ సాయి, వినయ్ ,కార్తిక్ రెడ్డి, శివ సాగర్, పుల్ల రెడ్డి ,చిన్న గౌడ్, చిన్న సుమంత్ ,చింటూ ,విష్ణు, సాయి కృష్ణ ,సందీప్, శశి ,కళ్యాణ్, నవీన్, మరియు పెద్ద ఎత్తున ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி