ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

258பார்த்தது
ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గురువారం ఉదయం టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన 74వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్వరం మాజీ శాసనసభ్యులు టీకేఆర్ కళాశాల చైర్మన్ తీగల కృష్ణారెడ్డి. కళాశాలలో ఏర్పాటు చేసిన 53 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్ సి సి విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్ సి సి విద్యార్థులు చేసిన కవాతు మరియు విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీకేఆర్ కళాశాల సెక్రెటరీ హరినాథ్ రెడ్డి , ట్రేసరర్ అమర్నాథ్ రెడ్డి ప్రిన్సిపాల్స్ హెచ్వోడీలు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగినది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி