దశదిన కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ గౌడ్

286பார்த்தது
దశదిన కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ గౌడ్
బుధవారం ఉదయం నాగోల్ కు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు చెరుకు సాయి గౌడ్ తండ్రి కీ. శే. చెరుకు జంగయ్య గౌడ్ దశదిన కార్యక్రమం నాగోల్ లోని వారి నివాసంలో నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు బి ఆర్ ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తో కలిసి హజరై నాగోల్ లోని వారి నివాసానికి వెళ్ళి కీ. శే. జంగయ్య గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం సాయి గౌడ్ ని మరియు వారి కుటుంభ సభ్యులను పరామర్శించి, ప్రఘాడ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెరుకు భవాని గౌడ్ ,గోల్కొండ మైసయ్య, చిరంజీవి, సంతోష్, జంగయ్య, రవీందర్ గౌడ్, ప్రవీణ్ ,శ్రీనివాస్, మధు, శ్యామ్ ,తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி