జైలులో రామాయణ నాటకం.. సీతను వెతకడానికి వెళ్లి ఖైదీలు పరార్

67பார்த்தது
జైలులో రామాయణ నాటకం.. సీతను వెతకడానికి వెళ్లి ఖైదీలు పరార్
ఉత్తరాఖండ్‌లోని రోషనాబాద్ జైలులో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దసరా సందర్భంగా జైలులో రామాయణ నాటకం వేశారు. ఇందులో భాగంగా వానర పాత్రధారులు పంకజ్, రాజ్ కుమార్.. సీతను వెతికే క్రమంలో 22 అడుగుల జైలు గోడ పైనుంచి దూకి పరారయ్యారు. పోలీసులు, తోటి ఖైదీలు చూస్తుండగానే ఈ పని చేశారు. పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు, రాజ్‌ కుమార్ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

தொடர்புடைய செய்தி