ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

70பார்த்தது
ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో బుధవారం చేరారు. కడుపునొప్పితో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. చండీగఢ్‌లోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలో విమానం దిగిన వెంటనే అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி