ఐసీసీ ఛైర్మన్ గా జై షా నామినేషన్ సమయంలో స్పందించని పీసీబీ: రిపోర్ట్

68பார்த்தது
ఐసీసీ ఛైర్మన్ గా జై షా నామినేషన్ సమయంలో స్పందించని పీసీబీ: రిపోర్ట్
బీసీసీఐ సెక్రెటరీ జై షా మంగళవారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నూతన ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ సమయంలో బోర్డులోని 16 మంది సభ్యులలో 15 మంది జై షాకు మద్దతు తెలపారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఎలాంటి స్పందన తెలపలేదు. "పీసీబీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జై షాకు బోర్డు సభ్యుల నుంచి పెద్దఎత్తున మద్దతు ఉన్నందున దాని అవసరం కూడా పడలేదు" అని ఓ నివేదిక తెలిపింది.

தொடர்புடைய செய்தி