పడవ బోల్తా.. 100 మందికి పైగా గల్లంతు (వీడియో)

65பார்த்தது
నైజీరియాలోని సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇస్లామిక్ పండుగకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓవర్‌లోడ్ కారణంగా పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు బుధవారం అధికారులు తెలిపారు. 100 మంది సామర్థ్యం కలిగిన బోటులో దాదాపు 300 మంది ప్రయాణం చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி