ఈ నీళ్లు తాగిన వాళ్లకే మా ఓటు: గ్రామస్థుల సవాల్ (Video)

74பார்த்தது
హర్యానాలో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ.. చర్ఖిదాద్రీ నియోజకవర్గంలోని సమస్పూర్ గ్రామస్థులు రాజకీయ నేతలకు సవాల్ విసిరారు. దశాబ్దాలుగా కలుషిత త్రాగునీటితో ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు.. తాము రోజు తాగుతున్న నీటిని ఎవరైతే తాగుతారో వారికే తాము ఓటు వేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు కలుషిత నీటి సమస్య పరిష్కారం కోసం ఎంతమంది నేతలకు మొరబెట్టుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోయారు.

தொடர்புடைய செய்தி