నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లోని ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ. సీ టీ. వీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి. ప్యాట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఉన్నారు.