జాతీయ బాలల దినోత్సవం సందర్బంగా గురువారం సిరికొండలోని ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులు నృత్యాలతో పాటు నాటికలు వేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఒక రోజు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. ఉత్తమ బాల ఉపాధ్యాయులు గా బి.నితిన్, బి.వినోద్ లకు ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కల్పన, ఉపాధ్యాయులు శివరాం, దేవీసింగ్, సునీత, తదితరులు పాల్గొన్నారు.