బాసర: నిజాయితీ చాటుకున్న గంగపుత్రులు

77பார்த்தது
బాసర: నిజాయితీ చాటుకున్న గంగపుత్రులు
బాసర గంగపుత్రులు నిజాయితీ చాటుకున్నారు. సోమవారం సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన నిజామాబాద్ జిల్లా రెంజల్ గ్రామానికి చెందిన ఓ భక్తురాలు గోదావరి పుష్కర ఘాట్ల వద్ద హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారు. ఆ బ్యాగు స్థానిక గంగపుత్రులకు దొరకడంతో వెంటనే ఆమెకు అప్పగించారు. బ్యాగులో రెండు సెల్ ఫోన్లు, నగదు ఉన్నాయని ఆమె అన్నారు. గంగపుత్రులను పలువురు అభినందించారు.

தொடர்புடைய செய்தி