బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

54பார்த்தது
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే
వర్ష ప్రభావిత బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బొజ్జు భరోసా ఇచ్చారు. బుధవారం దస్తురాబాద్ మండలంలోని గొడిసెరాల గ్రామంలో ఇటీవల భారీ వర్షాలతో ఇళ్లు కూలిపోయిన కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే పలు గ్రామాలలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி