మొక్కులు చెల్లించుకున్న గంగపుత్రులు

61பார்த்தது
ఖానాపూర్ వీడీసీ ఆధ్వర్యంలో గంగపుత్ర సంఘం నాయకులు మహిళలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన వీధులలో గంగపుత్ర సంఘం నాయకులు మహిళలు గొల్లిన వేసుకొని చల్ల ముంతలతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు బాగా పడాలని పంటలు బాగా పండి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని వారు మొక్కుకున్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி