విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమని, ప్రతి విద్యార్థి తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని, మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం బిక్షపతి తెలిపారు. గురువారం నాడు నల్గొండలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయంలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాద పూజా కార్యక్రమంలో పాల్గొని మహాశివునికి అభిషేకాలు చేసి, పూజలు నిర్వహించారు.