నేడు జరుగుతున్న 'ఖమ్మం-నల్లగొండ-వరంగల్’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఓటు వేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ స్కూల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి నీలిమ ABV స్కూళ్లో ఓటు వేశారు. అనంతరం ఆయన పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు.