అధికారుల సమక్షంలో బాలుడి శవానికి రీ పోస్టుమార్టం

1091பார்த்தது
అధికారుల సమక్షంలో బాలుడి శవానికి రీ పోస్టుమార్టం
హత్నూర మండలం కొన్యాల గ్రామంలో పాతిపెట్టిన బాలుడి డెడ్ బాడీకి శవ పరీక్షలు స్థానిక తహసీల్దార్, పోలీసుల సమక్షంలో రీ పోస్టుమార్టం జరిగింది. గ్రామానికి చెందిన ప్రభులింగం అనురాధ దంపతుల నెలన్నర కుమారుడి అనారోగ్య కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ గ్రామానికి చేరుకొని అధికారుల సమక్షంలో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி