వైద్య సేవలు నిలిపివేసిన ఆర్ఎంపీ, పీఎంపీలు

52பார்த்தது
పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో మహిళ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు వైద్య సేవలు నిలిపివేశారు. ఈ సందర్భంగా పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహిళ డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி