బీసీ కులగణన చేపట్టాలని నిరసన

69பார்த்தது
తెలంగాణలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు మాట్లాడుతూ, దేశంలో బీసీ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పార్లమెంట్ లో డిమాండ్ చేస్తుండగా, రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி