సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

80பார்த்தது
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న జూనియర్ లైన్ మెన్లకు అసిస్టెంట్ లైన్ మెన్ గా పదోన్నతి కల్పించడం పట్ల శనివారం మంచిర్యాలలో ఐఎన్టీయూసి అనుబంధ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

தொடர்புடைய செய்தி