జై భీమ్ సైనిక్ దళ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కాటం రాజు

81பார்த்தது
జై భీమ్ సైనిక్ దళ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కాటం రాజు
జాతీయ మాల మహానాడు అనుబంధ జై భీమ్ సైనిక్ దళ్ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడిగా నస్పూర్ కు చెందిన కాటం రాజు నియమితులయ్యారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జై భీమ్ సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆసాది పురుషోత్తం, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేష్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మాలలను ఐక్యం చేసి సమస్యల పరిష్కారానికి పోరాడనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி