జన్నారం మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు బుధవారం పంపిణీ చేశారు. జన్నారం ఎంపీడీవో కార్యాలయ సమావేశం మందిరంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుందని వాటిని వినియోగించుకోవాలన్నారు.