సదుపాయాలు లేకనే కార్మికుడు మృతి: ఏఐటీయూసీ

55பார்த்தது
సదుపాయాలు లేకనే కార్మికుడు మృతి: ఏఐటీయూసీ
సింగరేణి సంస్థలో సరైన సదుపాయాలు లేక కార్మికులు మృతి చెందుతున్నారని ఏఐటీయూసీ సంఘం నాయకులు బుధవారం ఆరోపించారు. మందమర్రి బ్రాంచ్ నాయకులు మాట్లాడుతూ కేకే 5 గనిలో మృతి చెందిన లక్ష్మణ్ మృతిని గని ప్రమాదకరంగా గుర్తించి అతని కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డైరెక్టర్ లెవెల్లో పోరాటం చేసి మృతుని కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி