మందమర్రి ఏరియాలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. 33/11 కేవీ అందుగులపేట సబ్ స్టేషన్ లో మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జీఎం ఆఫీస్, యాపల్, కేకే 2, ఊరు మందమర్రి, టోల్ ప్లాజా, మార్కెట్, దీపక్ నగర్, పాలచెట్టు, దొరల బంగ్లా, ఊరు రామకృష్ణాపూర్, కాళీ క్యాంప్, పులిమడుగు, అందుగులపేట, కోటేశ్వరరావుపల్లి, బొక్కలగుట్టలో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.