మందమర్రిలో రేషన్ బియ్యం పట్టివేత

66பார்த்தது
మందమర్రిలో రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న 26 క్వింటాళ్ల రేషన్(పీడీఎస్) బియ్యాన్ని బుధవారం మంచిర్యాల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ లచ్చన్న, సిబ్బందితో కలసి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై అనుమానాస్పదంగా వెళుతున్న వాహణాన్ని తనిఖీ చేశారు. బియ్యంతో పాటు వాహనాన్ని పట్టుకున్నారు. కోటపల్లి మండలం రాంపూర్ కు చెందిన డ్రైవర్ ధరణి సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி