కనుల పండుగగా బెల్లంపల్లిలో రావణ వధ ఘట్టం

70பார்த்தது
బెల్లంపల్లిలో రావణ వధ ఘట్టం శనివారం కనుల పండువగా కొనసాగింది. బెల్లంపల్లి పట్టణంతో పాటుగా తాండూర్, కాసిపేట, నెన్నెల, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తిలక్ స్టేడియానికి తరలివచ్చారు. దీంతో తిలక్ స్టేడియం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఘట్టాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ ఘట్టాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారు. దీంతో స్టేడియం ప్రాంగణమంతా కోలాహాలంగా మారింది. జైశ్రీరామ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி