కన్నెపల్లి మండలం వీగాం గ్రామంలో సూర మల్లయ్యకు చెందిన ఎద్దు పోలంపల్లి శివారులోని ట్రాన్స్ఫార్మర్ కు తగిలి మృతి చెందింది. రోజులాగే మేతకు వెళ్లిన ఎద్దు ట్రాన్స్ఫార్మర్ కు తగిలిందని సుమారు రూ. 70,000 ఉంటుందని రైతు సోమవారం తెలిపారు. పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.