పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు

59பார்த்தது
పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు
నిబంధనలు అతిక్రమించడమే కాకుండా అడ్డుకున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన గొల్ల సంపత్, అక్షిత్, చెన్నూరి రవి, బొజ్జ వెంకటేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేందర్ మంగళవారం తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ పెట్టారని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కోపోద్రిక్తులైన వారు పోలీసులతో అమర్యాదగా మాట్లాడడమే కాకుండా విధులకు కూడా ఆటంకం కలిగించారు.

தொடர்புடைய செய்தி