రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి

63பார்த்தது
రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి
కామారెడ్డి పట్టణంలో అక్టోబర్ 5న జరిగే భారతీయ కిసాన్ సంఘ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబా అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో విడుదల చేసిన డిక్లరేషన్ అమలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మహాసభలకు నాయకులు తరలి రావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி