అమెరికాలో విద్రోహ శక్తులతో కలిసి భారతదేశం పై విలేకరుల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అన్నారు. రాహుల్ గాంధీ దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శనివారం నారాయణపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.