మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలి

55பார்த்தது
మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలి
వినాయక మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి లింగయ్య అన్నారు. సోమవారం మక్తల్ పట్టణంలో వినాయక విగ్రహాలు ప్రతిష్టాపన చేసిన మండపాలను పరిశీలించారు. వినాయకులను నిమజ్జనం చేసే చెరువును పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా క్రెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చెరువు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. స్థానిక పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி