కల్వకుర్తికి సీఎం రాక సభ స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్

70பார்த்தது
ఈనెల 28న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాక సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని డబల్ బెడ్ రూమ్ సమీపంలో ఉన్న స్టేడియం ఆవరణను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి బుధవారం పరిశీలించారు. వెల్దండ మండలం కుట్ర జంక్షన్ వద్ద మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సందర్భంగా సిఎం వస్తున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி