భవాని తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

83பார்த்தது
భవాని తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండల పరిధిలోని భవాని తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி