11 ఏళ్ల నిరీక్షణకు తెర... బదిలీలపై టీచర్ల సంతోషం

68பார்த்தது
11 ఏళ్ల నిరీక్షణకు తెర... బదిలీలపై టీచర్ల సంతోషం
ఆదర్శ పాఠశాలల్లో ఎట్టకేలకు 11 ఏళ్ల తర్వాత బదిలీలు చేపట్టడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2013లో ఈ పాఠశాలలు ప్రారంభించగా, అప్పటి నుంచి బదిలీలు చేపట్టలేదు. తాజాగా విద్యాశాఖ పీజీటీ , టీజీటిలను పాత జోన్ల ప్రకారం బదిలీలు చేసింది. దీంతో ఆదర్శ పాఠశాలల్లో మొత్తం 160 ఖాళీలు ఉన్నాయి. కాగా సెలవు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల సోమవారం పలువురు ఆందోళనకు గురయ్యారు.

தொடர்புடைய செய்தி