పాన్ కార్డు హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు పాన్ కార్డుకు ఆధార్ కార్డు తప్పనిసరిగా అనుసంధానం చేయాలని సూచించింది. ఈ ప్రక్రియకు 2025 డిసెంబర్ 31ని గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా నోటిఫికేషన్ను జారీ చేసింది. 2024 అక్టోబర్ 1 లేదా అంతకంటే ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని సమర్పించి పాన్ తీసుకున్న వారు ఆధార్తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది.